కరీన కారణంగానే నా పిల్లలు దూరమయ్యారు.. సైఫ్ షాకింగ్ కామెంట్స్

by Dishanational2 |
కరీన కారణంగానే నా పిల్లలు దూరమయ్యారు.. సైఫ్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: మాజీ భార్య అమృతా సింగ్ తమ పిల్లలు, సారా అండ్ ఇబ్రహీమ్‌లను కలవడానికి అనుమతించడం లేదనే వార్తలపై సైఫ్ అలీఖాన్ మౌనం వీడాడు. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘పిల్లలను కలవడానికి నాకు అనుమతి లేదు. వారు నన్ను కలవడానికి కొంతకాలం భయపడ్డారు. ఎందుకంటే నా జీవితంలోకి వచ్చిన ఒక కొత్త మహిళ పిల్లల్లో తనపై నెగెటీవ్ ఫీలింగ్స్ క్రియేట్ చేస్తుందని అమృత భావించింది. అది సరైనది కాదని ఆమెకు తెలుసు. తన బంధువులు, పనిమనిషి దగ్గరే పిల్లలను పెంచింది. నా కుటుంబానికి మద్దతు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నప్పుడు ఆమె ఎందుకు అలా చేయాలి? అమృత బాధ్యతారహితమైన తండ్రిగా నా ఇమేజ్‌ను డ్యామేజ్ చేయాలనుకుంది. ఆమెను ఇప్పటికీ నేను గౌరవిస్తా. కానీ నన్ను భయంకరమైన భర్త, తండ్రిగానే చూస్తుంది. ఇప్పటికీ నా పిల్లలు సారా, ఇబ్రహీమ్‌లను చాలా మిస్ అవుతున్నా. నా పర్సులో వాళ్ల ఫొటోలుంటాయి. అవి చూసినప్పుడల్లా ఏడుపొస్తుంది’ అంటూ ఎమోషనల్ అయ్యాడు సైఫ్. ఇక సైఫ్, అమృతలు 1991లో పెళ్లి చేసుకుని 2004లో విడిపోగా 2012లో కరీనా కపూర్‌ను చేసుకున్నాడు సైఫ్.

Read More: మరో అవకాశం ఇవ్వమని రాజమౌళిని వేడుకుంటున్న నాని?



Next Story

Most Viewed